హైదరాబాద్: తెలంగాణ పోలీసులకు అమెరికా కాన్సులేట్ జనరల్ ప్రశంసలందించింది. జీఈఎస్ బాగా నిర్వహించారని తెలంగాణ పోలీసులకు కితాబిచ్చింది. భవిష్యత్లో కలిసి పనిచేద్దామని డీజీపీ మహేందర్రెడ్డికి అమెరికా కాన్సులేట్ జనరల్ ఈ మేరకు ఓ లేఖ రాసింది. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్-2017)ను ప్రశాంతంగా, దిగ్విజయంగా పూర్తిచేసేందుకు పకడ్బందీ భద్రత కల్పించిన డీజీపీ మహేందర్రెడ్డి, అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్)అంజనీకుమార్ను నీతిఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్ ప్రశంసించిన విషయం తెలిసిందే.