కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆలయాలకు వ్యతిరేకి అని బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ అన్నారు. గుజరాత్లో ఆలయాల చుట్టూ తిరుగుడం, కుంకుమ బొట్టు పెట్టుకోవడం, యజ్ఞోపవీతం ధరించడం మొదలైన వాటి ద్వారా తాను ఆలయాల వ్యతిరేకిని కాదని చెప్పుకోవడానికే రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నాడని సుశీల్కుమార్ ఆరోపించారు. భారత తొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ గుజరాత్లోని సోమనాథ్ ఆలయంలో పూజలు చేసినప్పుడు కుహనా లౌకికవాది అయిన అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సుశీల్ కుమార్ మోడీ అన్నారు.