హైదరాబాద్ : పీఎస్ఎల్వీ సీ-37 ప్రయోగం విజయవంతం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ద్వారా ఇస్రో భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిందన్నారు. ఈ ఘనతను సాధించిన మొదటి దేశంగా భారత్ రికార్డు సృష్టించడం గర్వకారణమని చెప్పారు. ఇస్రో ఇలాంటి మరిన్ని ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించి మానవాళి అభివృద్ధిలో శాస్త్ర సాంకేతిక రంగాలను ఉపయోగించుకోవాలన్నారు. మేథాశక్తిని ఉపయోగించి ఎంతో శ్రమించి ప్రయోగం చేయడం అద్భుతమన్నారు.