ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం కేసీఆర్ అభినందనలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 15, 2017, 11:46 AM

హైదరాబాద్ : పీఎస్‌ఎల్వీ సీ-37 ప్రయోగం విజయవంతం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ద్వారా ఇస్రో భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిందన్నారు. ఈ ఘనతను సాధించిన మొదటి దేశంగా భారత్ రికార్డు సృష్టించడం గర్వకారణమని చెప్పారు. ఇస్రో ఇలాంటి మరిన్ని ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించి మానవాళి అభివృద్ధిలో శాస్త్ర సాంకేతిక రంగాలను ఉపయోగించుకోవాలన్నారు. మేథాశక్తిని ఉపయోగించి ఎంతో శ్రమించి ప్రయోగం చేయడం అద్భుతమన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com