ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మరికాసేపట్లో మేడారం పంప్హౌస్కు బయల్దేరనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సీఎం కేసీఆర్ బ్యారేజీలు, పంప్హౌస్ల నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు మేడారం పంప్హౌస్ పనులను సీఎం పరిశీలించనున్నారు. అనంతరం రామడుగు మండలం లక్ష్మీపూర్కు సీఎం కేసీఆర్ చేరుకుంటారు. కాళేశ్వరం గ్రావిటీ కాల్వ సొరంగం పనులను సీఎం పరిశీలిస్తారు. రామడుగులోనే భోజన విరామం తీసుకొని అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.