తిరుమల శ్రీవారిని మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్రెడ్డి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామసమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకుని మ్రొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్దం నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికి బస, దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులచే వేదాశీర్వచనం అందించి, స్వామి వారి తీర్ధప్రసాదాలను, పట్టు వస్త్రాలను అందజేశారు.స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఏంపీ తెలిపారు.