హైదరాబాద్: వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్, స్పెషల్ ఆఫీసర్స్తో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. కడియం మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టే ప్రయత్నం చేస్తామని, విద్యార్థులకు నీట్, జేఈఈ, ఎంసెట్లో ఉచిత శిక్షణ ఇస్తామని తెలిపారు. ప్రతి ప్రభుత్వ కాలేజీకి నిర్వహణ గ్రాంట్ కింద రూ.లక్ష రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ప్రభుత్వ కాలేజీల్లో సమస్యలుంటే నా దృష్టికి తేవాలని, గ్రూప్ తగాదాలు పెట్టొద్దని సూచించారు. విద్యార్థులను చేర్చుకోవడంలో ప్రైవేట్ కాలేజీలతో పోటీ పడాలని తెలిపారు.