ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధోనీ ఎంత గొప్ప ఆటగాడో అందరికీ తెలుసా : హసన్ అలీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2017, 12:55 PM

నాణ్యమైన పేస్ బౌలర్లకు పాకిస్థాన్ పెట్టింది పేరు. ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో పాకిస్థాన్ నుంచి చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో హసన్ అలీ కూడా చేరుతున్నాడు. ఈ ఏడాది జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ నుంచి అత్యుత్తమ గణాంకాలు నమోదుచేసిన ఈ బౌలర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన పాక్ బౌలర్‌గానూ ఆ యువ ఆటగాడు రికార్డు నమోదు చేశాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో మహేంద్రసింగ్ ధోనీ వికెట్ తీసిన హసన్.. తాజాగా మహేంద్రుడిపై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘ది ట్రిబ్యూట్’ అనే వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన క్రికెట్ అనుభవాలను పంచుకున్నాడు.


‘ధోనీ ఎంత గొప్ప ఆటగాడో అందరికీ తెలిసిందే. మ్యాచ్‌లను అద్భుతంగా ముగించే బ్యాట్స్‌మెన్ వికెట్ తీయడం ఏ బౌలర్‌కైనా గొప్ప విషయమే. అలాంటి వికెట్ తీస్తే సాధారణంగా చాలా సంతోషానికి లోనవుతాం. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ధోనీ వికెట్ తీయడం నాకు చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది’ అని హసన్ అలీ చెప్పుకొచ్చాడు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో డుప్లెసి, జేపీ డుమినీ, పార్నెల్ వికెట్లు తీయడం కూడా పరిచిపోలేని అనుభూతి అని హసన్ అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఫైనల్లో భారత్‌తో ఆడిన మ్యాచ్‌లు తనకెంతో ప్రత్యేకమని చెప్పాడు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com