లక్ష్మీపూర్ పంప్హౌస్ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పరిశీలించారు. లక్ష్మీపూర్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం సర్జ్పూల్, 400కేవీ సబ్స్టేషన్ను నిర్మాణ పనులను పరిశీలించారు. పది డయామీటర్ల డి ఆకారపు వ్యాసార్థంతో నిర్మించిన మేడారం టన్నెల్ను సీఎం పరిశీలించారు. పంపు సెట్లు తయారు చేస్తున్న బీహెచ్ఈఎల్ అధికారులతో సీఎం మాట్లాడారు. డిసెంబర్ నాటికి అన్ని పంపులు అందజేస్తామని సీఎంకు బీహెచ్ఈఎల్ అధికారులు తెలిపారు. మరికాసేపట్లో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.