ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మరికాసేపట్లో టీడీపీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ భేటీ అవ్వనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. సాయంత్రం 5గంటల వరకు సమావేశం నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు టీడీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.