మహబూబ్నగర్ జిల్లాలోని బాలుర కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను మహబూబ్నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్, శాట్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 11 వరకు పోటీలు జరగనున్నాయి. పోటీల్లో పాల్గొనేందుకు అన్ని జిల్లాల నుంచి 400 మందికి పైగా క్రీడాకారులు తరలివచ్చారు.