కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్లు సీఎం తెలుసుకున్నారు. రెండు రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులపై ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం పనుల తీరుపై అసంతృప్తిని వెల్లడించారు. దీనిపై రేపు ప్రగతి భవన్లో ఉదయం 11గంటలకు సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్పై ఉన్నతాధికారులతో సీఎం సమావేశం కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు సీజన్లోగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు, వర్కింగ్ ఏజెన్సీలు హాజరుకావాలని ఆదేశించారు.