పెద్దపల్లి : రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉదయం పరిశీలించారు. 2020 మే నాటికి మొదటి యూనిట్, మరో ఆరు నెలల్లో రెండో యూనిట్ పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దూబే చెప్పారు. నిర్మాణంలో వేగం పెంచాలని.. నిర్ణీత లక్ష్యంలోగా పనులు పూర్తి చేయాలని బీహెచ్ఈఎల్ అధికారులను సీఎం కోరారు. తెలంగాణలో నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఇతర అవసరాలకు కూడా సాధ్యమైనంత త్వరలో విద్యుత్ అందించాలని సీఎం చెప్పారు. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, తెలంగాణ విద్యుత్ సంస్థలతో అనుసంధానం తదితర అంశాలను కేసీఆర్కు జెన్కో సీఎండీ ప్రభాకర్రావు వివరించారు. ప్లాంట్ నిర్మాణం, నిర్వహణకు అవసరమైన నీరు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.