వికారాబాద్ జిల్లా : కుల వృత్తులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయల నిధులతో తగిన చర్యలు తీసుకుంటున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కొడంగల్ లో రూ.70 లక్షల నిధులతో రైతు శిక్షణ కేంద్రం, పశు వ్యాధి నిర్థారణ కేంద్రాలను మంత్రులు మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గం లో 4250 మంది కుర్మలకు గొర్రెలను మంజూరు చేసి.. తొలి విడతలో 2300 మందికి అందించే క్రమంలో ఇప్పటికీ 560 యూనిట్ లు అందించినమన్నారు.