హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ను నియంత్రించే దిశగా ప్రత్యేక చర్యలు చేపడుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ బి. జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. మాదాపూర్లో తుది దశలో ఉన్న అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అండర్పాస్ బ్రిడ్జీ నిర్మాణం వల్ల ట్రాఫిక్ సమస్యలను నియంత్రించవచ్చన్నారు. హైదరాబాద్లో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నియంత్రించేందుకు మరిన్ని అండర్పాస్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయని, బ్యూటిఫికేషన్ పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయన్నారు.
ఈ నెల చివరి కల్లా పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవాన్ని జరుపుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. సందర్శకులను ఆకట్టుకునేందుకు వంతెనకు ఇరువైపుల పెయింటింగ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ హరిచందన, అర్బన్ బయో డైవర్సిటీ ఏసీ కృష్ణ, అర్బన్ బయో డైవర్సిటీ డైరెక్టర్ దామోదర్, డిప్యూటీ డైరెక్టర్ రాజేంద్రకుమార్, మొయినుద్దీన్, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.