గజ్వేల్ : ఆత్మహత్య చేసుకున్న ఓయూ విద్యార్థి మురళి కుటుంబానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్రావు రూ.10 లక్షలు ఆర్థికసాయం అందజేశారు. ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి మంత్రి హరీశ్రావు సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం దౌలాపూర్లోని మురళి ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, రూ.10లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. తల్లి వీరబోయిన లచ్చవ్వ, అన్న రాజుతో మాట్లాడి కుటుంబ వివరాలు, ఆర్థిక పరిస్థితులను తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు. కుటుంబంలో ఒకరికి గజ్వేల్ ప్రభుత్వ దవాఖానలో ఔట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామన్నారు. మంత్రి వెంట హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి, స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.