ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మియాపూర్ భూగోతంపై సుప్రీం విచారణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2017, 09:31 AM

న్యూఢిల్లీ: మియాపూర్ భూ కుంభకోణంపై తుది విచారణను జనవరి 30న చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొన్నది. మియాపూర్ భూ కుంభకోణం కేసుకు సంబంధించి శుక్రవారం జస్టిస్ ఎ.కె.సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టిం ది. పిటిషనర్ల తరపున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ ఎలాంటి భూకుంభకోణం జరగలేదని, మియాపూర్ భూములు ఎక్కడికీ పోలేదని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేశారని, అందువల్ల ఈ కేసులో తమపై దాఖలైన ఎఫ్‌ఐఆర్ ను కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలని వాదించారు. కాగా తెలంగాణ ప్ర భుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు నీరజ్ కిషన్ లాల్, పాల్వాయి వెంకట రెడ్డి వాదిస్తూ సంబంధిత కేసులో దర్యాప్తు పురోగతిలో ఉందని వివరించారు. ఈ నేపధ్యంలో పిటిషనర్ల వాదనను తిరస్కరిస్తూ జనవరి30న పిటిషన్ పై తుది విచారణ చేపడతామని ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com