అహ్మాదాబాద్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమానాశ్రయంలో క్యూలో నిలబడ్డారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్లైన్ ఎక్కేందుకు వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. విమానం ఎక్కేందుకు బోర్డింగ్ క్యూలైన్లోనే రాహుల్ వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇవాళ 71వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తల్లి సోనియాకు బర్త్డే విషెస్ చెప్పేందుకు రాహుల్ ఇవాళ ఉదయం ఢిల్లీకి వచ్చారు. అయితే ప్రస్తుతం గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మళ్లీ అక్కడకు వెళ్లేందుకు ఆయన విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది.