హైదరాబాద్ : నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుల పనుల పురోగతిపై ప్రగతి భవన్లో సమీక్ష సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్రతో ఒప్పందాలు కుదుర్చుకోవడంలో మంత్రి హరీష్రావు కీలకపాత్ర పోషించారని కితాబిచ్చారు. హరీష్రావుపై తెలంగాణ ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసి తమకు నీళ్లు అందిస్తారని ప్రజలు నమ్మకంతో ఉన్నారని సీఎం పేర్కొన్నారు. ప్రజల ఆశలకు అనుగుణంగా మంత్రి హరీష్రావు, ఇరిగేషన్ అధికారులు పని చేస్తున్నారని ప్రశంసించారు. సీఈ వెంకటేశ్వర్లు కూడా మహారాష్ట్ర అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడారని తెలిపారు.