మేడ్చల్: లారీని ఓ పాఠశాల బస్సు ఢీకొట్టిన ఘటన షామీర్పేట మండలం అలాయాబాద్ చౌరస్తా వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు, బస్సు డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. సిరిసిల్ల నుంచి గోల్కొండ కోట సందర్శనకు 30 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సుకు ప్రమాదం సంభవించింది. వెంటనే క్షతగాత్రులను మెడిసిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.