నాగార్జునసాగర్: సాగర్ ఎడమ కాలువకు నీటిని ఇవాళ మంత్రులు హరీశ్రావు, జగదీశ్ రెడ్డి విడుదల చేశారు. నాగార్జున సాగర్ 63వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎడమ కాలువకు నీటిని మంత్రులు విడుదల చేశారు. బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మంత్రి హరీశ్ రావు సాగర్ చేరుకున్నారు. అనంతరం సాగర్ వద్ద నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి మంత్రి నివాళులర్పించారు. తర్వాత మంత్రులు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇంచార్జ్ నోముల నర్సింహయ్య, నల్గొండ జెడ్పీ చైర్మన్ బాలూ నాయక్ పాల్గొన్నారు. అనంతరం.. మంత్రి హరీశ్ రావు ఏఎంఆర్ ప్రాజెక్టు, ఉదయ సముద్రం పనులపై మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు.