నల్గొండ్: యాసంగి పంటకు నీరు ఇచ్చేందుకు సాగర్ నుంచి ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశామని మంత్రి హరీశ్రావు అన్నారు. నాగార్జునసాగర్ నుంచి ఎడమ కాల్వకు నీరు విడుదల చేసిన అనంతరం మంత్రి హరీశ్రావు మాట్లాడారు. సాగర్ నుంచి 4 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వటమే లక్ష్యమన్నారు. యాసంగి పంట కోసం తొలి విడత నీరు విడుదల చేశామని, 2018 ఏప్రిల్ 5 నాటికి చివరి విడత నీరు విడుదల చేస్తామన్నారు. నీరు వృధా కాకుండా అధికారులంతా సమన్వయంతో పని చేయాలన్నారు.