ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాసంగి కోసమే సాగర్‌ నుంచి నీటి విడుదల: మంత్రి హరీశ్‌రావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 10, 2017, 12:08 PM

నల్గొండ్‌: యాసంగి పంటకు నీరు ఇచ్చేందుకు సాగర్‌ నుంచి ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. నాగార్జునసాగర్‌ నుంచి ఎడమ కాల్వకు నీరు విడుదల చేసిన అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. సాగర్‌ నుంచి 4 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వటమే లక్ష్యమన్నారు. యాసంగి పంట కోసం తొలి విడత నీరు విడుదల చేశామని, 2018 ఏప్రిల్‌ 5 నాటికి చివరి విడత నీరు విడుదల చేస్తామన్నారు. నీరు వృధా కాకుండా అధికారులంతా సమన్వయంతో పని చేయాలన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com