జనగామ: పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు ఇవాళ జిల్లాలో పర్యటించారు. దేవరుప్పల మండలం రామరాజుపల్లి గ్రామంలో ఎర్రబెల్లి దయాకర్ రావు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను ఎర్రబెల్లి దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే.. సతీసమేతంగా వాటర్ ప్లాంట్ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.