జయశంకర్ భూపాలపల్లి: సంచార జాతులకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని స్పీకర్ మధుసూదనాచారి స్పష్టం చేశారు. సింగరేణి మినీ ఫంక్షన్ హాల్ లో జరిగిన పూసల సంఘము భూపాలపల్లి జిల్లా సమన్వయ సమావేశానికి స్పీకర్ ఎస్ మధుసూదనాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పూసల వారితో ఉన్న అనుబంధాన్ని స్పీకర్ గుర్తు చేసుకున్నారు. కారణాలు ఏమైనా తెలంగాణ రాకముందు ఎవ్వరు కూడా కులాల గురించి ప్రస్తావన తీసుకురాలేదని, అందుకే సీఎం కేసీఆర్ అన్ని కులాలు సమాన స్థాయిలో ఉండేందుకు కృషి చేస్తున్నారని స్పీకర్ మధుసూదనాచారి తెలిపారు. భారత దేశం లో భిన్నమైన జీవ వైవిధ్యం ఉందన్నారు. పూసల సంఘం పరిస్థితులు, బీసీ ల సమావేశం లో చర్చకు వచ్చిందని చెప్పారు.. భూపాలపల్లి లో ఏక కాలంలో 20 కుల సంఘాల కు భవనాలు నిర్మించనున్నట్లు వెల్లడించారు.