జయశంకర్ భూపాలపల్లి: కాకతీయ రాజులు నిర్మించిన వెంకటాపూర్ మండలంలోని చారిత్రక రామప్పదేవాలయాన్ని విదేశీయులు సందర్శించారు. నైజీరియా, ఈజిప్ట్, మాలవి, పాలస్తీనా, బురుండి దేశాల నుండి వచ్చిన పర్యాటకులు రామప్ప దేవాలయంలో పూజలు చేశారు. దేవాలయ విశిష్టత, శిల్పకళా సంపద గురించి ఆలయ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ములుగు డీఎస్పీ ప్రత్యేక పూజలు చేశారు.