న్యూఢిల్లీ: వాయిదా పడుతూ వస్తున్న బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి (ఎస్జీఎమ్) రంగం సిద్ధమైంది. ఇక్కడ జరిగే సమావేశంలో.. కొత్తగా రూపొందించిన భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ), కొచ్చికి చెల్లించాల్సిన రూ. 850 కోట్ల నష్టపరిహారంపైనే సుదీర్ఘంగా చర్చ జరుగనుంది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ) గుర్తింపును షరతులతో పునరుద్ధరించనున్నారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) పరిధిలోకి క్రికెటర్లను తీసుకురాకుండా చూడటం. 2019-2021 వరకు సవరించిన ఎఫ్టీపీ ప్రకారం అక్టోబర్-నవంబర్, ఫిబ్రవరి-మార్చి నెలలో టీమ్ఇండియా విదేశీ పర్యటనలకు వెళ్లదు. 2019 నుంచి ఐపీఎల్ సమయంలో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్లు లేకుండా చూడాలని సింగపూర్లో రెండు రోజుల పాటు జరిగిన ఐసీసీ సమావేశంలో బీసీసీఐ ప్రతిపాదించింది.