చెన్నై: బీసీల రిజర్వేషన్ను 50 శాతానికి పెంచాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనలో... కేంద్ర ఉద్యోగాల్లో జోనల్ కమిషన్ సిఫారసుల మేరకు 27శాతం రిజర్వేషన్ను పూర్తిగా అమలు చేయలేదని ఓ ఆంగ్ల దినపత్రిక ప్రచురించిందని తెలిపారు. ఇది సామాజికన్యాయంపై నమ్మకం కలిగిన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోందన్నారు.
సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన సమాధానాల్లో 24 మంత్రిత్వశాఖల్లో ాఏ్ణ గ్రేడు అధికారులుగా బీసీల నుంచి 17శాతం మంది మాత్రమే నియమితులైనట్టు, ాబి్ణ గ్రేడులో 14బీ ాసి్ణలో 11బీ ాడి్ణలో 10 శాతం మాత్రమే ఉన్నారని తెలిసిందన్నారు. దీనిపై తాము నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. 1993 నుంచి కేంద్ర ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్ విధానం అమలవుతున్న నేపథ్యంలో ఇప్పుడు దానిని కాలరాసేందుకు భాజపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జనాభా సంఖ్యలో 52 శాతానికి పైగా ఉన్న బీసీ సామాజికవర్గానికి 27 శాతం రిజర్వేషన్ చాలదని జోనల్ కమిషన్ తన నివేదికలో ఇప్పటికే తెలిపిందని పేర్కొన్నారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో బీసీ సామాజిక వర్గాలకు రిజర్వేషన్ను 50 శాతానికి పెంచాలని కోరారు. ఇందుకు సంబంధించిన చట్టాన్ని పార్లమెంట్లో భాజపా ప్రభుత్వం తీసుకురావాలని డిమాండ్ చేశారు.