రామడుగు మండలం వెదిరలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. కరీంనగర్ గ్రామీణ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో సుమారు వంద మంది పోలీసులు పాల్గొన్నారు. తనిఖీల్లో కల్తీ ఆహార పదార్ధాలు, రూ.లక్ష విలువైన గుట్కా, బాణసంచా, సరైన పత్రాలు లేని 20 ద్విచక్రవాహనాలు, ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.