బీసీల సంక్షేమం, అభివృద్ధిపై మంత్రులు జోగురామన్న, ఈటల రాజేందర్ సమావేశం నిర్వహించారు. బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలని, వారి అభివృద్ధికి తోడ్పడే అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్కుమార్, అధికారులు హాజరయ్యారు.