>సీబీఐటీ కళాశాల యాజమాన్య తీరుకు నిరసనగా ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో కళాశాల బస్సులను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు విద్యార్థులను దించేశారు. ఫీజు తగ్గింపు విషయంలో యాజమాన్యం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలేదని నిరసన వ్యక్తం చేశారు. నాలుగు రోజులు విద్యార్థుల ఆందోళన చేయడంతో ఫీజు తగ్గిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఫీజు తగ్గింపుపై సర్కులర్ ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.