మారేడ్పల్లి : జెమ్స్ట్రీట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉదయం గుర్తు తెలియని వ్యక్తి (45) రైలు పట్టాల పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో ఎంఎంటీ ఎస్ రైలు వచ్చి అతన్ని కొట్టడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మృతుడి సంబంధీకులు ఎవరైనా ఉంటే సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.