నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలం అభంగపట్నంలో దళితులపై దాడి చేసిన బీజేపీ నేత భరత్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. 25 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న భరత్రెడ్డిని హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నిజామాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల రోజులుగా భరత్రెడ్డి కోసం నిజామాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. మొరం తరలింపును అడ్డుకున్నారని దళిత వ్యక్తులైన లక్ష్మణ్, రాజేశ్వర్లను భరత్రెడ్డి అపహరించిన విషయం విదితమే. ఇటీవల బాధితులను స్వస్థలానికి పోలీసులు చేర్చారు. బాధితుల ఫిర్యాదుతో భరత్రెడ్డిని పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు.