హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలకు భాగ్యనగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. తెలుగు మహాసభల విశిష్టతను, గొప్పదనాన్ని తెలియజేసే విధంగా నగరంలో స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. స్వాగత తోరణాలతో భాగ్యనగరం పరవశించిపోతోంది. ఈ తోరణాలకు మధ్య భాగంలో తెలంగాణ తల్లి ప్రతిమను ఏర్పాటు చేశారు. ఒక్కో చోట ఒక మహనీయుడి పేరుతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులకు అపూర్వ స్వాగతం పలికేందుకు మహానగరం ముస్తాబైంది.