మీర్జాపూర్ :ఫ్రాన్స్నుంచి భారతదేశ పర్యటనకు వచ్చిన మహిళలు ఇక్కడ లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారణాశికి చెందిన ఒక మహిళ ఫ్రెంచ్ పర్యాటకులను తీసుకుని మీర్జాపూర్లోని లఖానియా దారి వాటర్ ఫాల్కు వచ్చారు. ఆ సమయంలో వారిపై లైంగిక దాడి జరిగింది. దీనికి సంబంధించి బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి నలుగురు వ్యక్తులను ముందు అరెస్టు చేశారు. తరువాత మరొక నలుగురిని అరెస్టు చేశారు. కాగా వారణాశినుంచి వచ్చిన మహిళపై కొంతమంది దాడి చేశారని, పర్యాటకులపై కాదని పోలీసులు చెప్పారు. అరడజనుమంది పర్యాటకులతో వారణాశికి చెందిన మహిళ ఇక్కడకు వచ్చిందని ఆహ్రైరా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఒ ప్రవీణ్ సింగ్ చెప్పారు.