భువనగిరి: త్వరలో పశుసంవర్థకశాఖలో 540 ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఇవాళ భువనగిరిలో మంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికే గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటివరకు 30లక్షల గొర్రెలు పంపిణీ చేశామన్నారు. అలాగే చనిపోయిన గొర్రెలకు బీమా పరిహారం అందజేస్తున్నామని మంత్రి తెలిపారు.