హైదరాబాద్:సీబీఐటీ కళాశాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫీజులు తగ్గించాలంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. గండిపేట నుంచి సీబీఐటీ వరకు ర్యాలీగా వచ్చిన విద్యార్థులు కళాశాలలోని ప్రిన్సిపల్ రూమ్లోకి దూసుకెళ్లారు. విద్యార్థులతో మాట్లాడేందుకు ప్రిన్సిపల్ ప్రయత్నించినా విద్యార్థులు పట్టించుకోకుండా అక్కడే బైఠాయించారు. విద్యార్థులకు మద్దతుగా ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు.