హైదరాబాద్ : కృష్ణా నది జలాల పంపకాలపై కృష్ణా ట్రిబ్యునల్లో సోమవారం వాదనలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల వాదనలు కొనసాగనున్నాయి. ఉమ్మడి రాష్ర్టానికి కేటాయించిన జలాలను ఏపీ, తెలంగాణకు పంచే బాధ్యతను కేంద్రం.. కృష్ణా ట్రిబ్యునల్కు అప్పగించింది. ఇప్పటికే ట్రిబ్యునల్ ముందు అఫిడవిట్లను ఇరు రాష్ర్టాలు దాఖలు చేశాయి. గత వాదనలలో భాగంగా ఏపీ నీటి వినియోగంపై తెలంగాణ తరపు న్యాయవాది క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.