యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోటకొండూర్, గుండాల మండలాల్లో గత కొన్ని నెలల నుంచి వ్యర్థ రసాయనాలు వదిలి వెళ్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రెండు లారీలు, కారును సీజ్ చేశారు. ఆలేరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కెమికల్ డ్రమ్ములను డంప్ చేస్తున్న విషయం తెలిసిందే.