పాల్వంచలో తుక్కు పరిశ్రమ మంజూరు కావడంపై అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ర్యాలీలో కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎండీసీ పాల్వంచ స్పాంజ్ ఐరన్ యూనిట్లో జరిగిన సమావేశంలో జలగం వెంకటరావు మాట్లాడుతూ.. త్వరలోనే తుక్కు పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేయిస్తానని చెప్పారు.