ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మామునూరులో వెటర్నరీ కాలేజీ భవనానికి శంకుస్థాపన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 11, 2017, 02:53 PM

వరంగల్ అర్బన్ జిల్లాలోని మామునూరులో వెటర్నరీ కాలేజీ భవనానికి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఈ వెటర్నరీ కళాశాలను రూ. 208 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు. పశు వైద్యశాలను రూ. 5 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. వెటర్నరీ విద్యార్థులకు జాబ్స్ తప్పకుండా వస్తాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 30 లక్షల గొర్రెలను పంపిణీ చేశామని పేర్కొన్నారు. గొర్రెలకు మేత కోసం గడ్డి విత్తనాలు రాయితీపై పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గొర్రెల సంరక్షణకు సంచార వైద్యశాలలు ఏర్పాటు చేశామన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టిందని గుర్తు చేశారు. బడుగు, బలహీనవర్గాలకు ఆర్థిక స్వాతంత్య్రం వస్తుందన్నారు. త్వరలో వరంగల్‌లో 4 మాంస విక్రయ మార్కెట్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com