సినిమా అవకాశాల్లేక మరో నటుడు అర్థంతరంగా తనువు చాలించాడు. బొమ్మరిల్లు, అమ్మాయిలు-అబ్బాయిలు, ఒకరికి ఒకరు, సోగ్గాడు, కరెంట్, వరప్రసాద్ పొట్టి ప్రసాద్, ధనలక్ష్మి తలుపు తడితే వంటి సినిమాల్లో కమెడియన్ గా మంచి గుర్తింపుతెచ్చుకున్న విజయ్ సాయి సూసైడ్ చేసుకున్నాడు..యూసుఫ్ గూడ లోని సొంత ప్లాట్ లో ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో పాటు కుటుంబ కలహాలతో విజయ్ కొన్నాళ్లుగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు.. విజయ్ అతడి భార్యకు మధ్య మనస్పర్థలు తలెత్తడంతో కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. వారికి ఒక పాప కూడా ఉంది. విడాకుల అనంతరం పాప భార్య సంరక్షణలో ఉంటోంది. అయితే తన పాపను చూసేందుకు కూడా భార్య అనుమతించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన విజయ్ ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హీరోగా కమెడియన్ గా పలు చిత్రాల్లో నటించి అందర్నీ మెప్పించిన విజయ్ ఆకస్మిక మృతితో టాలీవుడ్ షాక్ కి గురైంది..పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు.