ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దొంగతనాలకు పాల్పడుతున్న కుటుంబం అరెస్ట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 11, 2017, 04:31 PM

వికారాబాద్ : వికారాబాద్, తాండూరు పట్టణాల్లో కొన్ని రోజులుగా దొంగతనాలకు పాల్పడుతున్న కుటుంబాన్ని పోలీసులు అరెస్టు చేశారు. తాండూరు రైల్వేస్టేషన్ సమీపంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముఠా సభ్యుల నుంచి రూ. 6,92,800 విలువ చేసే బంగారు నగలు, శ్యామ్‌సాంగ్ గెలాక్సీ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అన్నపూర్త తెలిపారు. ఈ ముఠాపై తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో దొంగతనం కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com