గుహవాటి : అసోంలో రైలు ఢీకొని ఆరు ఏనుగులు మృతి చెందిన సంఘటన మరువక ముందే మరో రెండు ఏనుగులు మృతి చెందాయి. నాగౌన్ జిల్లాలోని సామ్గౌరిలో విద్యుత్ షాక్తో రెండు ఏనుగులు ప్రాణాలు కోల్పోయినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పంట పొలాలను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లకు ఏనుగులు తాకడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో గుహవాటి ఎక్స్ప్రెస్ ఢీకొని ఆరు ఏనుగులు మృతి చెందిన విషయం తెలిసిందే.