వరంగల్ రూరల్ : వరంగల్ రూరల్ జిల్లాలో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. రాయపర్తి మండలం కొత్తూరు గ్రామ శివారులో గిరిజన కూలీలను చూసి ఎమ్మెల్యే కారు దిగారు. గిరిజన కూలీలతో కాసేపు ముచ్చటించిన దయాకర్ రావు.. వారి సద్దన్నం రుచి చూశారు. దీంతో గిరిజనులు సంతోషం వ్యక్తం చేశారు. వర్దన్నపేట మండలం ల్యాబర్తిలో ఇటీవల మరణించిన అనుమదాసు స్వామి.. కుటుంబ సభ్యులను ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించి, ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామంలో పది లక్షల వ్యయంతో నిర్మించనున్న స్మశానవాటికకు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపన చేశారు.