హైదరాబాద్: అవినీతిలో కాంగ్రెస్, టీఆర్ఎస్లు రెండూ ఒకటేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు అన్నారు. ఇవాళ కూకట్పల్లిలో నిర్వహించిన బీజేపీ యువమోర్చా సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీధర్రావు మాట్లాడుతూ కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ అవినీతి పార్టీలేనని, అవినీతికి దూరంగా ఉండే పార్టీ బీజేపీ ఒక్కటేనని పేర్కొన్నారు. కేసీఆర్కి దమ్ముంటే మీడియాతో, సభల్లో మాట్లాడడం కాకుండా ఓయూలో సభ పెట్టాలని సవాల్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.