హైదరాబాద్ : పూర్వపు పాలమూరు జిల్లాకు చెందిన పండుగ సాయన్న నవలను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆవిష్కరించారు. సెక్రటేరియట్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్, నవల రచయిత బెక్కెం జనార్ధన్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ పాలమూరు జిల్లాకు చెందిన పండుగ సాయన్న గొప్ప మానవతావాది అని పేర్కొన్నారు. పేదల ఆకలిని తీర్చిన గొప్ప వ్యక్తి సాయన్న అని కొనియాడారు. పేదలకు అండగా, భరోసాగా ఉన్నారని గుర్తు చేశారు. పేదల ప్రేమ పొందిన మహనీయుడు పండుగ సాయన్న అని ఈటల తెలిపారు.