ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీఆర్‌ఎస్‌లోకి ఉమా మాధవరెడ్డి

Telangana Telugu |   | Published : Wed, Dec 13, 2017, 08:58 AM

హైదరాబాద్/యాదాద్రి భువనగిరి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్‌లోకి వలసలజోరు కొనసాగుతున్నది. మాజీ మంత్రి, టీడీపీ నేత ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, ఆమె కుమారుడు, యాదాద్రి భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సందీప్‌రెడ్డి గురువారంటీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. మంగళవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో వారు భేటీ అయ్యారు. ప్రభుత్వ విధానాలు, పరిపాలనతీరు నచ్చి టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకొన్నట్టు తమ మనోగతాన్ని సీఎం కేసీఆర్‌కు వివరించారు. రాష్ర్టాభివృద్ధికి కలిసి రావాలని నిర్ణయించుకోవటం సంతోషకరమని కేసీఆర్ అన్నారు. వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని, తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చుకుందామని చెప్పారు. ఈ భేటీలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు, విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, నల్గొండ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇంచార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఉమామాధవరెడ్డి  ప్రతినిధితో మాట్లాడుతూ, గురువారం ఉదయం ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్‌లో టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు చెప్పారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com