మొహాలీ: భారత్ - శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్ నేడు మొహాలీలో జరగనుంది. తొలి వన్డేలో విజయం సాధించిన శ్రీలంక మొహాలీలో కూడా గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తుండగా, ఈ వన్డేలో విజయం సాధించి సిరీస్ విజయావకాశాలను సజీవంగా ఉంచుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉంది. ఈ నేపథ్యంలో మొహాలీలో ఇరు జట్లూ నిన్న ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి. ప్రాక్టీస్ అనంతరం శ్రీలంక కెప్టెన్ ఫెరీరా మీడియాతో మాట్లాడాడు. ఈ వన్డే సిరీస్ ను గెలుచుకోవడానికి మొహాలీ వన్డే మంచి అవకాశం అని పేర్కొన్నాడు. తొలి వన్డేలో పరాజయ పరాభవాన్ని మరచిపోయి మొహాలీ వన్డేలో విజయం సాధిస్తామన్న ధీమాను టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తం చేశాడు