అహ్మదాబాద్: తంతు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. భాజపా తరఫున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా అగ్రనేతలు, కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీతోపాటు సీనియర్ నాయకులు హోరాహోరీ ప్రచారం చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ఉత్తర, మధ్య ప్రాంతాల్లోని 14 జిల్లాల్లో జరుగబోతున్న ఈ దశ ఎన్నికల్లో.. బీఎస్పీ (75 మంది), అఖిల భారత హిందుస్థాన్ కాంగ్రెస్ పార్టీ (ఏఐహెచ్సీపీ- 46 మంది), ఎన్సీపీ (28 మంది) సైతం తమ అభ్యర్థులను నిలబెట్టాయి. 350 మంది స్వతంత్ర అభ్యర్థులు, 168 మంది ఇతరులు ఈ సారి పోటీలో నిలబడుతున్నారు.