ప్రపంచ తెలుగు మహాసభలకు గొప్పగా ఏర్పాట్లు చేస్తున్న ప్రభు త్వం, మహాసభలకు వచ్చే ప్రతినిధులు పసందైన వంటకాలు వడ్డించనున్నారు. దేశ, విదేశాలకు చెందిన ప్రతినిధులకు నోరూరించే శాఖాహార రు చులతో అదిరిపోయే ఆతిథ్యం ఇచ్చేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. నాలుగు రోజుల పాటు రోజుకో రకం వంటలు సిద్దం చేస్తున్నారు. సాహితీ సభలు, సాంస్కృతిక ప్రదర్శనలే కాకుండా ఆతిథ్యం కూ డా అద్భుతంగా ఉండేలా ప్రణాళికా బద్దంగా ఏ ర్పాట్లు చేస్తున్నారు. మెను ఎంపిక, వంటల త యారీ, వడ్డించే బాధ్యతలను ప్రభుత్వం పౌరసరఫరాల శాఖకు అప్పగించింది. ఈ శాఖ ఆధ్వర్యంలో మహాసభల వద్ద ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. సుమారు పది వేల మంది ప్రతినిధులకు సరిపడా భోజన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఒకే దగ్గర వంటకాల తయారీ
వంటకాల తయారీకీ అన్ని వేదికలకు సమీపంలో ఉన్న ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం వద్ద సెం ట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన ఆదిత్య కేటరర్స్ నాలుగు రోజులపాటు సెంట్రలైజ్డ్ కిచెన్ వద్ద వంటలు సిద్దం చేసుకుని, సభా వేదికలకు తీసుకెళ్లనున్నారు. ఈ వంటల త యారీ కోసం పౌరసరఫరాల శాఖ టెండర్లు ఆహ్వానించగా సుమారు 30 కేటగింగ్ సంస్థలు పాల్గొనగా ఆదిత్య కేటరర్స్ను ఎంపిక చేశారు.
రోజువారీగా వంటకాలు
మొదటి రోజు(డిసెంబర్ 16)
అన్నంతో పాటు వెజ్ బిర్యాని, పట్టు వడియాల పులుసు, బగారా బైగాన్, పనీర్ బటర్ మసాలా, బెండకాయ ఫ్రై, చింతకాయ పండు మిర్చి ఛట్నీ, దొండకాయ పచ్చడి, పచ్చిపులుసు, టమాట రసం, చింతపండు పులిహోరతో పాటు ఘజల్ ర హల్వా, బక్షాలు స్వీట్లు, పూరి ఉంటాయి.
రెండవ రోజు(డిసెంబర్ 17)
జీరా రైస్, బీరకాయ, టమాట, సోయ కూరలు, మెంతుల పులుసు, ఆలుమట్టర్, వంకాయ సోగి ఫ్రై, గోంగూర పప్పు, దోసకాయ ఛట్నీ, పచ్చిమిర్చి ఛట్నీ, పచ్చిపులుసు, కందగడ్డ పులుసు, పెసర గారలు, చపాతితో పాటు బూందీ లడ్డు, కద్దు కా హల్వాలు ఉంటాయి.
మూడవ రోజు(డిసెంబర్ 18)
బగారా రైస్, మిర్చి, కాప్సికం కూరలు, సొరకాయ పొడి పప్పు, మిక్స్డ్ వెజ్ కర్రీ, ఆలు వేపుడు, గంగవాయిలు, మామిడికాయ పప్పు, టమాట ఛట్నీ, బీరకాయ పచ్చడి, మక్క గారలు, జొన్న రొట్టెలతో పాటు కుర్బానీ కా మిట్టా, ఐస్ క్రీం ఉంటాయి.
చివరి రోజు(డిసెంబర్ 19)
టమాట రైస్, చిక్కుడుకాయ టమాట కూరచ, వం కాయ పులుసు, ఆలూ పాలక్, కంద వేపుడు, ట మాట పప్పు, వంకాయ ఛట్నీ, గోంగూర పచ్చడి, పచ్చి పులుసు, దాల్చ, అరటికాయ బజ్జి, రుమాలి రోటిలతో పాటు డబుల్ కా మీటా, జిలేబి.
ప్రతి రోజు ఉండే ఐటమ్స్
వైట్ రైస్, ఫ్రూట్ సలాడ్, సకినాలు. సర్వపిండి, చల్ల మిరపకాయలు, పాపడ్,మూడు రకాల పోడులు, మూడు రకాల ఛట్నీలు, పప్పుచారు, కట్ మిర్చి, పెరుగు,రెండు రకాల పాన్లు, 250 ఎంఎల్ వాటర్ బాటిళ్లు ప్రతి రోజు ఉంటాయి.